ఇండియన్ నేవీలో ఉద్యోగాలు..టెన్త్ పాసైన వాళ్లు అర్హులు..త్వరగా అప్లయ్ చేసుకోండి!
ఆసక్తి ఉన్న యువతకు భారత నౌకాదళం ఆహ్వానం పలుకుతోంది. భారీ ఎత్తున ట్రేడ్స్ మ్యాన్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1159 పోస్టులను భర్తీ చేయనున్నారు.
◆ మొత్తం ఉద్యోగాల సంఖ్య: 1159
◆ వివిధ నావల్ కమాండ్లలో ఖాళీగా ఉన్న ట్రేడ్స్ మ్యాన్ పోస్టుల వివరాలు:
ఈస్టర్న్ నావల్ కమాండ్: 710 పోస్టులు వెస్టర్న్ నావల్ కమాండ్: 324 పోస్టులుసౌతర్న్ నావల్ కమాండ్: 125 పోస్టులు
★ అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి.
★ వయస్సు: 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ&ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
★ ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
★ పరీక్ష విధానం: పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
★ దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
★ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 22
★ దరఖాస్తు ప్రక్రియ చివరితేదీ: మార్చి 7
★ వెబ్సైట్: joinindiannavy.gov.in