అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ (78) ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎడమ చేతిని బైబిల్పై ఉంచి కుడి చేతిని పైకి లేపి బైడెన్ ప్రమాణం పూర్తి చేశారు..కాగా,అగ్రరాజ్య అధిపతిగా బాధ్యతలు చేపట్టిన రోజే 15 అంశాలకు సంబంధించిన కార్వనిర్వహక ఉత్తర్వులపై సంతకం చేశారు. వీటిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలను బైడెన్ పక్కనబెట్టారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం, వాతావరణ మార్పులపై పారిస్ ఒప్పందం, డబ్ల్యూహెచ్ఓలో తిరిగి చేరడం, వలస విధానం సహా పలు కీలక అంశాలు ఉన్నాయి.
కాగా,యూఎస్ సిటిజన్షిప్ చట్టం-2021 పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లుపై బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేసి ఆమోదం కోసం కాంగ్రెస్కు పంపారు. అక్రమంగా ఉంటున్నవారిని బలవంతంగా పంపే కార్యక్రమాన్ని కూడా మార్చి 21 వరకు నిలిపేయాలని ఆదేశించారు. బైడెన్ నిర్ణయంతో కేవలం హెచ్-1బీ వీసాదారులే కాదు, వారి కుటుంబీకులు, డిపెండెంట్స్ అందరికీ ఊరట లభించింది. హెచ్1బీ వీసా విధానం ద్వారా విశేష ప్రయోజనం పొందుతున్న భారతీయ సాంకేతిక నిపుణులకు, ఇతర వృత్తి నిపుణులు, విద్యార్థులకు ఈ బిల్లు కొత్త ఏడాదిలో మళ్లీ డాలర్ డ్రీమ్స్ను చిగురింపచేసిందనడంలో సందేహాం లేదు.తాజా బిల్లుతో ఉపాధి-ఆధారిత గ్రీన్కార్డు లభించడానికి దేశాలకున్న పరిమితులు తొలగిపోతాయి. ఈ పరిమితి వల్ల భారతీయులు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ నిపుణులు ఎంతో నష్టపోతున్నారు. ఇప్పటి వరకు దేశాల పరిమితి 7 శాతం ఉండగా చిన్న, పెద్ద దేశాలనే తేడా లేదు. తాజాగా వాటిని ఎత్తేస్తున్నారు.