తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల తేదీలను సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ (ఎస్ఎస్సీ) బోర్డు తాజాగా ప్రకటించింది. మే 17వ తేదీ నుంచి మే 26 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ ఏడాది 11 పేపర్ల విధానానికి తెర దించుతూ పలు మార్పులు చేసిన తెలంగాణ విద్యా శాఖ కేవలం 6 పరీక్షలనే నిర్వహించనుంది.మే 17 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలను ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష సమయం కేటాయించింది.
మే నెలలో తెలంగాణ పదో తరగతి పరీక్ష షెడ్యూల్ ఇలా.. 1. 17న ప్రథమ భాష (తెలుగు)
2. 18న ద్వితీయ భాష (హిందీ)
3. మే 19న ఇంగ్లీష్
4. మే 20న గణిత శాస్త్రం
5. మే 21న సామాన్య శాస్తం
6. మే 22న సాంఘీక శాస్త్రం పరీక్షలు జరగనున్నాయి.