ప్రముఖ తెలుగు సినీ నిర్మాత,డిస్ట్రిబ్యూటర్ దొరస్వామి రాజు కన్నుమూశారు..అనారోగ్య కారణాలతో గత కొన్ని రోజులుగా బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆయన.. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.వీఎంసీ పేరుతో డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించి ఎన్నో సినిమాలకు నిర్మాతగా, పంపిణీదారుడిగా దొరస్వామి రాజు వ్యవహరించారు. డ్రైవర్ రాముడు, వేటగాడు, యుగంధర్, గజదొంగ, ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి సినిమాలను వీఎంసీ సంస్థ ద్వారా విడుదల చేశారు..అలాగే టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. వాటిల్లో సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్గారి పెళ్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలేపెళ్లాం వెంగమాంబ వంటి చిత్రాలున్నాయి. దాదాపు 750 సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్ వ్యవహరించారు
కాగా..సినిమాలే కాక రాజకీయాలలోను తన సత్తా చాటిన దొరస్వామి 1994లో నగరి నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీటీడీ బోర్డు మెంబర్గా, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వంటి కీలక పదువుల్లోనూ కొనసాగారు…