మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న పవర్ఫుల్ యాక్షన్ డ్రామా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్స్టార్ రామ్చరణ్ ఓ కీలకపాత్రలో నటించనున్న విషయం తెలిసిందే.యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడెక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నటుడు సోనూసూద్ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు.
కాగా,శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో చిరు-కొరటాల మధ్య జరిగిన సరదా సంభాషణను చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు.ప్రస్తుతం హైదరాబాద్లో చివరి దశ చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాను మే 9న విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఇక ఆచార్య తర్వాత మెగాస్టార్ మోహన్రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్’ రీమేక్లో నటించనున్నారు.