పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రానున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. కన్నడ చిత్ర దర్శకుడు ప్రశాంత్నీల్ తెరకెక్కించనున్న ఈ సినిమాలో ప్రముఖ నటి శ్రుతిహాసన్కు అవకాశం దక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో తొలుత దిశా పటానీ హీరోయిన్గా నటిస్తుందన్న టాక్ నడిచింది.. కానీ అనూహ్యంగా శృతి హాసన్ పేరు పరిశీలనలోకి రాగా ఆమెను ఫైనలైజ్ చేశారు. ఇందుకోసం ఆమె కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం గత కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శృతి ఈ మధ్య కాలంలో అందుకుంటున్న అతి పెద్ద పారితోషికం ఇదేనని తెలుస్తోంది. కాగా,తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. ఇటీవల మాస్ మహారాజా రవితేజతో నటించిన ‘క్రాక్’ చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లక్బస్టర్గా నిలిచింది.
కాగా,’సలార్’ సినిమాలో మొదటి సన్నివేశాన్ని రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించనున్నారు.ఈమేరకు ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో సెట్ సిద్ధం చేయగా ప్రభాస్, చిత్రయూనిట్తో కలిసి గోదావరిఖని చేరుకున్నాడు. పోలీస్ కాన్వాయ్ మధ్య అతడిని బొగ్గు గనికి తీసుకువెళ్లారు. ప్రభాస్ వస్తున్నాడని తెలిసి అభిమానులు దారిపొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సలార్ సెట్స్లో ప్రభాస్ అడుగు పెట్టిన వీడియో కూడా నెట్టింట హల్చల్ చేస్తోంది. సుమారు పది రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్ గౌడ, సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు