అ!’, ‘కల్కీ’ వంటి వినూత్నమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్వర్మ. ఈసారి మరో అడుగు ముందుకేసి మరింత భిన్నమైన చిత్రాన్ని మనముందుకు తీసుకొచ్చాడు. ఇప్పటి వరకూ హాలీవుడ్కే తెలిసిన జాంబీలను తెలుగు తెరపై చూపించాడు. బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించగా..ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్లుగా నటించారు. జబర్దస్త్ గెటప్ శ్రీను, పృథ్వీరాజ్ కీలకపాత్రలు పోషించారు. మార్క్ కె.రాబిన్ సంగీతం సమకూర్చారు. అనిత్ మాదాడి సినిమాటోగ్రఫీ అందించారు. సాయిబాబు తలారి ఎడిటర్.
అయితే ఫిబ్రవరి 5న 500 వందలకు పైగా థియేటర్స్లో విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోతోంది.విడుదలకు ముందే ‘జాంబి రెడ్డి’కి మంచి ప్రచారం కల్పించడం, తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్తో పాటు రెండో రోజు కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.4.63 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంటే, ఈ మొత్తంలో డిస్ట్రిబ్యూటర్ షేర్ విలువ రూ.2 కోట్ల పైనే ఉంటుంది.
కాగా..‘జాంబి రెడ్డి’ తొలి రోజు రూ.2.26 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీనిలో రూ.1.03 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ఉంటుంది. అలాగే తొలి మూడు రోజులు ముగిసే సరికి సుమారు రూ.3 కోట్ల షేర్ను ఈ సినిమా వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పటికే రెండు రోజుల్లో రూ.2 కోట్ల పైనే షేర్ను ఈ సినిమా వసూలు చేసింది. అలాగే..సినిమాకు పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి మూడో రోజు మరో కోటి రూపాయలు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.