ఆంధ్రప్రదేశ్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ఆదివారం సాయంత్రంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 168 మండలాల్లో గ్రామ పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో 32,504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవికి 13 వేలకు పైగా నామినేషన్లు రాగా, వార్డు మెంబర్కు 35 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయి.ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు.కాగా, ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకూ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు.
ఏపీలో తొలి విడతలో పంచాయతీ ఎన్నికలు జరిగే రెవెన్యూ డివిజన్లు:
కృష్ణా జిల్లా – విజయవాడ ;గుంటూరు జిల్లా – తెనాలి ; ప్రకాశం జిల్లా – ఒంగోలు ; నెల్లూరు జిల్లా – కావలి; కర్నూలు జిల్లా – నంద్యాల, కర్నూలు ; శ్రీకాకుళం జిల్లా – శ్రీకాకుళం,టెక్కలి,పాలకొండ ; విశాఖపట్నం జిల్లా – అనకాపల్లి ; తూర్పుగోదావరి జిల్లా – కాకినాడ, పెద్దాపురం ; పశ్చిమగోదావరి జిల్లా – నర్సాపురం